భారీ అంచనాల నడుమ స్టార్ డైరెక్టర్ శంకర్ `భారతీయుడు 2` చిత్రాన్ని ప్రారంభించారు. 23 ఏళ్ల తర్వాత శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో ప్రెస్టీజియస్గా ప్రారంభమైన ఈ చిత్రం కొన్ని రోజుల పాటు చిత్రీకరణను జరుపుకుంది. అయితే శంకర్ `2.0` అనుకున్న రీతిలో సక్సెస్ కాకపోవడంతో లైకా సంస్థ `భారతీయుడు 2` బడ్జెట్ విషయంలో శంకర్కు పరిమితులు విధించింది. కానీ శంకర్ ససేమిరా అనడంతో షూటింగ్ ఆగిపోయింది.చివరకు లైకావారి నియమాలకు ఓకే చెప్పడంతో సినిమా దారులు సుగమమైయ్యాయని వార్తలు వినపడుతున్నాయి. సినిమా ఆగస్ట్ మూడో వారంలో సినిమా ప్రారంభం అవుతుంది. కాజల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరుల నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది తమిళ సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకుంటున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.
previous post