ప్రముఖ సినీ గేయ రచయిత భాస్కరభట్ల తల్లి విజయలక్ష్మి(67) తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చిక్సిత పొందుతూ కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. భాస్కరభట్ల పెద్దవాడు. ఆమె అంత్యక్రియలు స్థానిక ఇన్నీసుపేట కైలాసభూమిలో మంగళవారం జరిగాయి. భాస్కరభట్ల చితికి నిప్పు పెట్టారు. పలువురు సినీ, సాహితీకారులు భాస్కరభట్లకు తమ సానుభూతిని తెలియజేశారు.
previous post
next post