Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. చాలా కాలం తర్వాత పవన్ సినిమా వేడుక జరగడం తో అభిమానులు… ఫుల్ సందడి చేశారు. హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా కేటీఆర్, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. కాగా జరిగిన ఈ ప్రీ రిలీజ్ వేడుకలో.. అభిమానులకు “బీమ్లా నాయక్” టీం ఊహించని సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది.
మేటర్ లోకి వెళ్తే సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ నీ ఆశ్చర్య పరిచారు. ఫుల్ ఫైర్ యాక్షన్ నేపథ్యంలో పవన్.. రానా.. నువ్వా నేనా అన్నట్టు గా డైలాగులు వేసుకున్నారు. వాస్తవానికి ఫిబ్రవరి 21 వ తారీకు ప్రీ రిలీజ్ వేడుక జరగాల్సి ఉండగా ఆ రోజు ఏపీ మంత్రి మరణించటంతో వేడుక వాయిదా పడటం తెలిసిందే. కాని అదే సమయం లో రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ అభిమానులను ఎంతగానో డిసప్పాయింట్ చేసింది.
అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ పర్వాలేదనిపించింది. ఎవరూ ఊహించని విధంగా ముందు గా ప్రకటన లేకుండానే వచ్చిన ఈ సర్ ప్రైజ్ కి అభిమానులు సైతం షాక్ తిన్నారు. చీఫ్ గెస్ట్ గా వచ్చిన కేటీఆర్.. కొత్త ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కొత్త ట్రైలర్ లో “అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య మడమతిప్పని యుద్ధమని”.. రానా.. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ లని చాలా అద్భుతంగా కొద్ది నిమిషాల్లోనే చూపించడం.. సినిమా పై మరింత ఇంట్రెస్ట్ పెంచింది. ఫస్ట్ టైం రిలీజ్ అయిన ట్రైలర్ అనేక రికార్డులు సాధించడంతో సెకండ్ ట్రైలర్ ఇప్పుడు ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.