Bheemla Naayak: “బీమ్లా నాయక్” ఫిబ్రవరి 25వ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టారర్ నేపథ్యంలో పవన్, రానా నటించిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అదే సమయంలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేయటం జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ఈ సినిమాకి కే సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా డైలాగులు.. స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించడంతో..”బీమ్లా నాయక్” చూడటానికి అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో సినిమాకి సంబంధించి టికెట్లు హాట్ కేకుల్లా గా అమ్ముడుపోయాయి. హైదరాబాద్ సిటీ లో అడ్వాన్స్ బుకింగ్ లో ఒక కోటి రూపాయలు కలెక్ట్ అయినట్లు ఇది సెన్సేషన్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఒక హైదరాబాదులో మాత్రమే కాక ఆల్ ఓవర్ ఇండియాలో రికార్డు స్థాయి బుకింగ్స్ జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిందట. నైజాంలో 35 కోట్లు, సీడెడ్ లో 16.50 కోట్లు, యూఏ 9 కోట్లు, ఈస్ట్ 6.40 కోట్లు, వేస్ట్ 5.40కోట్లు, గుంటూరు 7.20 కోట్లు, కృష్ణ ఆరు కోట్లు, నెల్లూరు 3.25 కోట్లు, మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 88.75 కోట్లు వసూళ్లు చేయగా కర్ణాటక ఇంకా మిగతా ప్రాంతాలలో కలిపి 18 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు నూట ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసినట్లు హిట్ టాక్ వస్తే… రెండు వారాల్లో మొత్తం అన్ని రికార్డులు “బీమ్లా నాయక్” పగలకొట్టడం గ్యారెంటీ అని తాజా లెక్కల ప్రకారం ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ రోజు మరికొద్ది గంటల్లో సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరగనున్న క్రమంలో.. టికెట్ రేట్ల ధరల గురించి ఏపీ ప్రభుత్వం గురించి పవన్ కళ్యాణ్ అదేవిధంగా తెలంగాణ మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!