Bheemla Naayak: “బీమ్లా నాయక్” సినిమా రేపు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. సరిగ్గా విడుదలకు రెండు రోజుల ముందు జరిగిన ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల మధ్య చాలా వైభవంగా జరిగింది. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకలో రుజువైంది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మరియు టాలెంట్ గురించి.. క్రేజ్ గురించి తమదైన శైలిలో వ్యాఖ్యానించారు. స్టార్లు సూపర్ స్టార్లు ఎంతమంది ఉన్నా గాని ఒక కల్ట్ ఫాలో అయ్యే వ్యక్తి పవన్ కళ్యాణ్ చాలా విలక్షణమైన నటుడు.. వ్యక్తిత్వం అంటూ కేటీఆర్ పొగిడారు.
ఇక ఇదే సమయంలో వయసు పెరుగుతున్న గాని క్రేజ్ అదే విధంగా పెరగటం చాలా గ్రేట్ అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. కాగా ఈ సినిమాకి సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ… ప్రస్తుతం నేను ఏమీ మాట్లాడ దలుచుకోలేదు. ఎందుకంటే సినిమా నేను చూశాను.. ఎంత సెన్సేషన్ రికార్డులు క్రియేట్ చేస్తుందో నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాలని భావించడం లేదు మళ్ళీ సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాం..అంటూ “బీమ్లా నాయక్” బ్లాక్ బస్టర్ హిట్ అన్న తరహాలో తమన్ స్పీచ్ ఇచ్చారు.
కాగా విడుదలైన రెండు సాంగులకు మంచి ఆదరణ కల్పించినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆధ్వర్యంలో వచ్చిన అఖండ, గతంలో అలా వైకుంఠపురం లో.. ఇంకా మరి కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. ముఖ్యంగా గత ఏడాది బాలయ్య బాబు సినిమాలో తమన్నా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సినిమాకి హైలెట్ గా నిలిచింది. దీంతో బీమ్లా నాయక్ కి తమన్ ఏ విధంగా మ్యూజిక్ అందించాడో అన్నది ఉత్కంఠభరితంగా మారింది.