Bheemla Naayak: “బీమ్లా నాయక్” రిలీజ్ వేడుక ఫిబ్రవరి 21వ తారీకు సోమవారం హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయగా ఆఖరి క్షణంలో ఆగిపోవడం తెలిసిందే. కారణం చూస్తే ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి గుండెపోటుతో మరణించడంతో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా వేశారు. దీంతో అభిమానులు ఫుల్ నిరుత్సాహం చెందారు. ఇక ఇదే సమయంలో వారి నిరుత్సాహం పెరగకుండా తగ్గించడానికి “బీమ్లా నాయక్” ట్రైలర్ చెప్పిన సమయం కంటే గంట లేటుగా విడుదల చేయడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే ఫిబ్రవరి 25వ తారీకు సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇటువంటి తరుణంలో ఒకపక్క ట్రైలర్ రిలీజ్ కావడంతో ప్రీ రిలీజ్ వేడుకకు అసలు జరుగుతుందా లేదా అన్న సందేహం లో అభిమానులు ఉండిపోయారు. పరిస్థితి ఇలా ఉంటే గ్యారెంటీగా ఫిబ్రవరి 23 వ తారీకు బుధవారం సాయంత్రం నాడు కూడా పోలీస్ గ్రౌండ్స్ లోనే ఈ వేడుక చేయాలని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అందుకు తగ్గ ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఈరోజు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అంతమాత్రమే కాకుండా ముఖ్య అతిథులుగా కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లో పవన్ కళ్యాణ్ అదే విధంగా టిఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ సినిమా వస్తూ ఉండటంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. పైగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తూ ఉండటంతో పాటు సినిమాకి డైలాగులు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందించడంతో… ఏ స్థాయి విజయం సాధిస్తుందో అని అందరూ సరికొత్త లెక్కలు వేసుకుంటున్నారు.