Bheemla nayak: పవన్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..తెలంగాణలో 5వ షోకు పర్మిషన్ వచ్చేసింది. ఇక రచ్చ రచ్చే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలీవుడ్ టాల్ హీరో రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన మల్టీస్టారర్ సినిమా ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 25) ‘భీమ్లా నాయక్’ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. పవర్ స్టార్ సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగానే కాక విదేశాలలోనూ ఉండే హంగామా మరో రేంజ్. ఆ హంగామా ఓ రేంజ్లో మొదలైపోయింది. ఇక అన్ని ఏరియాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవడం.. క్లోజ్ అవడం కూడా జరిగిపోయింది.
ఈ నేపథ్యంలో ‘భీమ్లా నాయక్’ విడుదలకు ముందు చిత్రబృందం నేడు (ఫిబ్రవరి 23 బుధవారం) సాయంత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. దీనికి హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదిక అయింది. ఈ గ్రాండ్ ఈవెంట్కు తెలంగాణ మంత్రులు కేటీఆర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిలుగా విచ్చేయనున్నారు. ఇక మరో రెండు రోజుల్లో (ఫిబ్రవరి 25) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదలకు పరిస్థితులు ఏపీలో ఒకలా ఉంటే తెలంగాణాలో మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ మూవీ కి స్పెషల్ షో పర్మీషన్ దొరికింది.
Bheemla nayak: ఇది భీమ్లా నాయక్ సినిమా వసూళ్లకు బూస్టప్
తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ సినిమాకు 5 షోలు ప్రదర్శించుకోడానికి ప్రభుత్వం అనుమతిచ్చి అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు అభ్యర్థన మేరకు కేసీఆర్ ప్రభుత్వం రెండు వారాల పాటు ఈ నెల 25 తేదీ నుంచి మార్చి 11 వరకు అదనపు షోను ప్రదర్శించడానికి అనుమతిని ఇచ్చింది. ఖచ్చితంగా ఇది భీమ్లా నాయక్ సినిమా వసూళ్లకు బూస్టప్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించగా..నిత్యా మీనన్తో పాటుగా సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్స్గా నటించారు.