Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ సాగర్ కె. చంద్ర తెరకెక్కించిన చిత్రం `భీమ్లా నాయక్`. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఇందులో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.
మలయాళంలో హిట్టైన `అయ్యప్పనుమ్ కోషియుమ్`కు ఇది రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా తొలి రోజే పాజిటిక్ టాక్ సొంతం చేసుకుంది. అయితే టాక్ అదిరిపోయినా.. కొన్న బయర్లకు నష్టాలు మాత్రం తప్పలేదు.
మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం.. నాలుగో రోజు నుంచి డల్ అయిపోయింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు తక్కువ ఉండటం కూడా భీమ్లా నాయక్ కలెక్షన్లకు గండి పడింది. తాజాగా ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్ల లెక్కలు బయటకు వచ్చాయి. వాటి ప్రకారం.. లాంగ్ రన్లో భీమ్లా నాయక్ రూ. 98.20 కోట్ల షేర్ను వసూల్ చేసింది. ఏరియాల వారీగా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజాం- రూ. 35.00 కోట్లు
సీడెడ్- రూ. 11.20 కోట్లు
ఉత్తరాంధ్ర- రూ. 7.66 కోట్లు
ఈస్ట్ గోదావరి- రూ. 5.54 కోట్లు
వెస్ట్ గోదావరి- రూ. 5.13 కోట్లు
గుంటూరు- రూ. 5.30 కోట్లు
కృష్ణా- రూ. 4.25 కోట్లు
నెల్లూరు- రూ. 2.83 కోట్లు
——————————————
ఏపీ+తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్- రూ. 76.91 కోట్లు
——————————————-
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక- రూ.8.28 కోట్లు
ఓవర్సీస్- రూ. 12.65 కోట్లు
————————————————–
వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్- రూ. 98.20 కోట్లు (రూ.161 కోట్లు గ్రాస్)
————————————————–
ప్రపంచవ్యాప్తంగా రూ.106.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన భీమ్లా నాయక్.. రూ. 107 కోట్లతో బరిలోకి దిగింది. కానీ, లాంగ్ రన్లో రూ. 98.20 కోట్లనే వసూల్ చేయడంతో.. బయర్లకు దాదాపు రూ. 9 కోట్ల నష్టం వచ్చిందని అంటున్నారు. కాగా, ఈ సినిమా రేపటి నుంచీ ప్రముఖ ఓటీటీ సంస్థలు హాట్స్టార్, ఆహాలలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.