Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి తొలిసారి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా.. ఎస్.ఎస్.తమన్ స్వరాలు సమకూర్చారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. భీమ్లా నాయక్ ఓటీటీ రిలీజ్ గురించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లాస్ హాట్స్టార్ `భీమ్లా నాయక్` డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను భారీ ధరకు సొంతం చేసుకుందని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమా థియేటర్స్ లోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీ లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలతో హాట్స్టార్ వారు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట.
ఈ లెక్కన మార్చి ఆఖరి వారంలో భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!