Mahesh Trivikram: ముచ్చటగా మూడో సారి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా స్టార్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేయడం జరిగింది. పోకిరీ తరువాత అతడు సినిమా వచ్చి ఉంటే మహేష్ క్రేజు తిరుగులేని విధంగా ఉండేదని చెబుతారు. “పోకిరి” తర్వాత మహేష్ కి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడంతో ఆ తరువాత అతడు వచ్చి ఉంటే సైలెంట్ హిట్ కాకుండానే కాక మహేష్ తిరుగులేని నెంబర్ వన్ హీరో అనిపించేది అని చాలామంది చెబుతారు.
మహేష్ నటన లో త్రివిక్రమ్ కొత్త కొత్త యాంగిల్ తీయడంలో దిట్ట అని కూడా అంటారు. ఈ క్రమంలోనే ఖలేజాలో మహేష్ లో ఉన్న కామెడీ యాంగిల్ తీసి.. ప్రేక్షకులను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కడుపుబ్బా నవ్వించాడు అని విశ్లేషిస్తారు. అయితే తాజాగా మూడో సినిమా స్టోరీ మహేష్ కి విపరీతంగా నచ్చిందట. దీంతో సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో మహేష్ కరోనా బారిన పడటంతో పాటు అన్నయ్య రమేష్ బాబు మరణించడం.. సినిమా ఆగిపోయేటట్లు చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ సరసన మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నీ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ కి మరదలుగా సినిమాలో మలయాళ అమ్మాయిని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
సినిమాలో మెయిన్ పాత్ర ఉన్నట్లు టాక్ కూడా వస్తుంది. దీంతో ఈ పాత్ర పై త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ భామ ప్రస్తుతం `భీమ్లా నాయక్` లో రానాకి జోడీగా నటిస్తోంది. భీమ్లానాయక్ సినిమాకు మాటాలు , స్క్రీన్ ప్లే మొత్తం త్రివిక్రమ్ చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆసమయంలో సంయుక్త మీనన్ కు ఫిదా అయినా త్రివిక్రమ్ మహేష్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడని ఫిలింనగర్ టాక్. కాగా ఈ సినిమా త్వరలో స్టార్ట్ చేయనున్నట్లు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొన్ని పాటలు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించినట్లు సమాచారం.