గత ఏడాది జనవరిలో విడుదలై సక్సెస్ను సాధించిన చిత్రం `భాగమతి`. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి టైటిల్ పాత్రధారిగా నటించింది. అశోక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమాను బాలీవుడ్లో తెరకెక్కించడానికి డైరెక్టర్ అశోక్ సన్నాహాలు చేస్తున్నారు. భూమి పెడ్నేకర్ ఇందులో టైటిల్ పాత్రలో నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఓ ప్రముఖ బాలీవుడ్ హీరోను కూడా నటింప చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినపడుతున్నాయి.
previous post