తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బిగ్ బాస్… త్వరలో సీజన్ ఫోర్ స్టార్ట్ కానుంది. గత సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా గెలవగా, యాంకర్ శ్రీముఖి రన్నర్ గా గెలవడం జరిగింది. సీజన్ త్రీ లో కపుల్ గా హౌస్ లో అడుగుపెట్టిన వరుణ్ సందేశ్- వితిక లా జంట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
వితికా ఎప్పుడు అలిగిన వరుణ్ వచ్చి ఓదార్చటం తో పాటు వరుణ్ సందేశ్ ఫ్రెండ్షిప్ కి చాలా వ్యాల్యూ ఇచ్చి జెన్యూన్ గేమ్ ఆడటం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా హిమజా కోసం ఓ టాస్క్ లో పేడ నీళ్లలో పడుకోవడం తో చాలా మందిని వరుణ్ తన గేమ్ తో ఆకట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వితిక కూడా…. వరుణ్ అంత కాకపోయినా…. ఇంటిలో పెద్ద తరహా పాత్రలో బాగానే అలరించింది.
ఇదిలా ఉండగా త్వరలో సీజన్ స్టార్ట్ కానున్న తరుణంలో లో వరుణ్ వితిక జంట కంటే….. దానికి మించిన కపుల్ హౌస్ లో దింపడానికి షో నిర్వాహకులు రెడీ అయినట్లు సమాచారం. వాళ్ళు మరెవరో కాదు ప్రణవి, రఘు మాస్టర్. ఇద్దరూ ఈ సారి జరగబోయే సీజన్ కి హైలెట్ అవుతారని షో నిర్వాహకులు తీసుకురావడానికి రెడీ అయినట్లు టాక్.