ADIPURUSH: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ చేస్తుండగా సీత పాత్రలో…. కృతి కర్బంద నటిస్తోంది. సైఫ్ ఆలీ ఖాన్ రామ్ రెండు పాత్రలలో నటిస్తున్నాడు. బాలీవుడ్ నిర్మాతలు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది.
ఈ సినిమా కోసం రాత్రింబగళ్ళు కష్టపడుతూ మొన్నటిదాకా… షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్రభాస్.. తీవ్రస్థాయిలో కృషి చేశారు. బాహుబలి సినిమా తో క్రేజీ భారీగా ఉండటంతో… టాలీవుడ్ ఇండస్ట్రీలో రాముడి పాత్రలో ప్రభాస్ కటౌట్ వెండి తెరపై మీద చూడటానికి ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఓమ్ రౌత్ … సన్నివేశాలు కూడా రక్తికట్టించే లా… క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట.
ఇదిలాఉంటే ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ 13 టైటిల్ కొట్టిన సిద్ధార్థ శుక్ల నీ తీసుకోవడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. ప్రభాస్ తో నటించడానికి.. ఈ టైటిల్ విన్నర్ ఎంతగానో ఆత్రుతగా ఉన్నట్లు ఇప్పటికే డైరెక్టర్ తో మాట్లాడినట్లు అంతా ఓకే.. అయినట్లు మేఘనాథ్ పాత్రలో.. ఇతగాడిని చూపించడానికి.. ఓం రౌత్ డిసైడ్ అయినట్టు సమాచారం. అధికారికంగా ఇంకా ఈ విషయం తెలియక పోయినా గాని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో… టెలివిజన్ ప్రేక్షకులు ఈ వార్త పట్ల ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.