సినిమాలో కథ, కథనాలకు ఎక్కువప్రాధాన్యత ఉంటుంది. ఏ ఎలిమెంట్స్ జోడించినా ముందు చెప్పినట్లు కథ, కథనాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సాహో’ విషయంలో సుజిత్ తనదైన స్క్రీన్ప్లేతో అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్ను ప్రేక్షకులకు ఇవ్వనున్నాడని సినీ వర్గాల సమాచారం. ఇంతకు ఆ సీక్రెట్ ఏంటంటే.. ప్రభాస్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాడట. మరి నిజానిజాలు తెలియాలంటే ఆగస్ట్ 30 వరకు ఆగాల్సిందే. సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వేల్యూస్తో సినిమాను నిర్మించారు. శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటించింది. నీల్ నితిన్ ముఖేశ్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, మందిరాబేడి, అరుణ్ విజయ్, మురళీశర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన చిత్రం కావడంత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!