Prabhas: నేషనల్ స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు మారుతి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోందంటూ గత కొద్ది రోజుల నుంచీ జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు సందడి చేయబోతున్నారు.
అఫీషియల్గా ఈ సినిమాను ఇంకా అనౌన్స్ చేయకపోయినా.. మారుతి ప్రస్తుతం కథకి తుదిమెరుగులు దిద్దే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీని ప్రారంభించేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.
ఈ నెల 10న ప్రభాస్ – మారుతి కాంబో మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్ అవ్వబోతోందట. వచ్చే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ షురూ చేయనున్నారట. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రాబోతోందని టాక్.
కాగా, ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, ఓం రౌత్ తో `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో `ప్రాజెక్ట్-కె`, సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.