సీజన్ ఫోర్ బిగ్ బాస్ షో ఊహించని విధంగా ఉంది. హౌస్ లో ఎప్పటికప్పుడు వాతావరణం మారిపోతుంది. వైల్డ్ కార్డు రూపంలో ఇప్పటికే ముగ్గురు సభ్యులు ఇంట్లోకి రావడంతో కొన్న రిలేషన్లు కాస్త డైలమాలో కి వెళ్ళి పోతున్నా పరిస్థితి. ముఖ్యంగా టాస్కులు విషయానికొచ్చేసరికి బిగ్ బాస్ ఇంటి సభ్యులతో ఓ రకంగా ఆడుకుంటున్నారు. అయితే ఈ తరహా టాస్క్ లలో ఇద్దరు సభ్యులు తమ వీర ప్రతాపం చూపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో, బయట వారిపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది అనే డిస్కషన్లు జరుగుతున్నాయట.
నామినేషన్ లో లో వాళ్ళిద్దరినీ పెట్టండి ఇంటికి పంపి చేస్తాం అన్న రీతిలో నెటిజన్లు వారి పై ఫైరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్లు మరెవరో కాదు సొహైల్, మెహబూబ్. ఇటీవల బిగ్బాస్ ఇచ్చిన కాయిన్స్ టాస్క్ ఇంటిలో అనేక వివాదాలకు కారణం అయింది. ఈ కాయిన్స్ టాస్క్ లో ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వారికే బెనిఫిట్స్ ఉంటాయని బిగ్ బాస్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ టాస్క్ లో సొహైళ్ స్టార్టింగ్లో పద్ధతిగా గేమ్ ఆడిన చివరాకరికి రౌడీయిజం తరహాలో తనతోపాటు మెహబూబ్ ని తీసుకుని హౌస్ లో చిన్న సైజు గుండాయిజం చేసినట్టు వ్యవహరించారు.
ముఖ్యంగా ఈ టాస్క్ లో సొహైళ్.. అభిజిత్ మరియు అమ్మ రాజశేఖర్ తో ఆల్మోస్ట్ ఆల్ కొట్టుకునే దాకా పరిస్థితి వెళ్ళిపోయింది. చాలావరకు ఫిజికల్ గా దాడిచేసే తరహాలో ఇద్దరు ఆడటంతో చూసిన వీక్షకులు…. వీళ్ళని ఇంటికి పంపించడానికి తెగ ఆత్రుత పడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం గట్టిగా జరుగుతుంది. రోబో టాస్క్ లో కూడా ఈ ఇద్దరూ ఓవరాక్షన్ ఎక్కువ చేశారని తాజా పరిణామంపై డిస్కషన్లో మరింతగా ఎక్కువ అయ్యాయి. కాయిన్స్ టాస్క్ లో చాలా వైల్డ్ గా ఆడటంతో ఈ వీకెండ్ నాగార్జున వీళ్ళకి క్లాస్ పికటం గ్యారెంటీ అని వీక్షకులు భావిస్తున్నారు.