బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. షో ఎప్పటికప్పుడు చూసే ప్రేక్షకులకు మరింత ఇంట్రస్ట్ కలిగించే విధంగా ఇంటిలో ఉన్న సభ్యులకు కన్ఫ్యూజన్ తెచ్చే రీతిలో వైల్డ్ కార్డు రూపంలో కొత్తకొత్త ముఖాలను ఇంటిలోకి తీసుకెళ్తున్నారు బిగ్ బాస్. దాదాపు షో ప్రారంభమైన సందర్భాలలో చాలా మంది కొత్త ముఖాలు చూసి చూసే వీక్షకులు తెలియని వారిని తెచ్చారు, ఈ సీజన్ అంతగా ఏమీ లేదని కామెంట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో షో స్టార్టింగ్ లో లాస్య, దేత్తడి హారిక, అభిజిత్, గంగవ్వ, దేవి నాగవల్లి వంటి ముఖాలు తెలిసినవి కావటంతో వీళ్లే స్ట్రాంగ్ అని అనుకున్నారు.
కాని తాజా పరిస్థితి చూస్తే కొత్త ముఖాలుగా వచ్చిన వారిలో ముగ్గురు కచ్చితంగా చివరి రోజు వరకు తమ సత్తా చాటే విధంగా రాణిస్తున్నారని…. ఎవరైతే స్ట్రాంగ్ అనుకున్నారో వాళ్లంతా వీక్ అవుతున్నారని బయట టాక్. వీక్ గా ఇంటిలో ఉన్న సభ్యులు ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ లుగా మారినట్లు సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా మెహబూబ్ ప్రారంభంలో పెద్ద ఫాలోయింగ్ లేదనుకున్న మూడో వారానికి ఇతనికి వస్తున్న ఓట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటునట్లు తేలింది.
రెండో వ్యక్తి అఖిల్ సార్ధిక్ కూడా చాలా బ్యాలెన్స్ అండ్ కంట్రోల్ గేమ్ ఆడుతున్నారని… ఉన్న కొద్ది స్ట్రాంగ్ అవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా అరియనా కూడా “డూ ఆర్ డై” అన్న తరహాలో గేమ్ ఆడటంతో చాలా స్ట్రాంగ్ అయినట్టు ఈ ముగ్గురు చివరి దాకా ఉండే అవకాశం ఉన్నట్లు బయట వీక్షకులు తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు.