బుల్లితెరపై తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటులు శివజ్యోతి, రవికృష్ట. తీన్మార్ వార్తలు అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. వివిధ ప్రోగ్రామ్స్తో శివజ్యోతి మస్తు పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే, రవి కృష్ణ పలు సీరియల్స్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులు అలరిస్తున్నారు. వీరిద్దరు కూడా బిగ్బాస్ రియాలిటీ షో సీజన్ 3లో పాల్గొన్నారు.
బిగ్బాస్ 3లో పాల్గొన్న వీరిద్దరూ మంచి మిత్రులుగా మారిన సంగతి తెలిసిందే. నిజంగానే ఒకే కుటుంబానికి చెందిన వారిలాగా కలిసిపోయారు. రవికృష్ణ అయితే శివజ్యోతి గురించి ప్రస్తావించిన ప్రతి సందర్భంలోనూ తనను పొగడ్తలతో ముంచెత్తేవాడు. రవికృష్ణ ఇప్పటికే అనేక సార్లు శివజ్యోతిని తనకు దేవుడు ఇచ్చిన చెల్లెలు అంటూ అనేక సార్లు చెప్పారు. అయితే, శివజ్యోతి తనకు చెల్లెలు మాత్రమే కాదనీ.. తకను అమ్మని తాజాగా రవికృష్ణ చెప్పారు. తనను చిన్నపిల్లాడిలా కంటికి రెప్పలా చూసుకున్నారని కన్నీరు పెట్టుకునీ.. అందరినీ ఏడిపించారు.
ఎప్పుడూ? ఎక్కడా? అనే కదా ! మీ ప్రశ్న? ఇటీవల దసరా సందర్భంగా స్టార్మా ఓ ప్రత్యేక కార్యక్రామాన్ని ప్రసారం చేసింది. జాతరో జాతర అనే ప్రోగ్రామ్లో రవికృష్ణ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన శివజ్యోతి, ఆమె భర్త గురించిన మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు రవికృష్ణ. ఇటీవల తనకు కరోనా సోకిందనీ, ఆ సమయంలో తాను శివజ్యోతి ఇంట్లో ఉన్నానని చెప్పారు. “ఆ సమయంలో మా ఇంట్లో ఎవరూ లేరు. నాకు పాజిటివ్ వచ్చిందని తెలిసికూడా నన్ను వారి ఇంట్లో ఉండమని చెప్పింది. ఆ సమయంలో నన్ను ఓ చిన్నపిల్లాడిలా చూసుకుంది” అని చెప్పాడు.
అలాగే, తానని “నేను ఎప్పుడూ చెల్లి అని పిలుస్తాను కానీ.. తాను చెల్లి కాదు అమ్మ. నిజాంగానే ఆ సమయంలో నన్ను తాను అంతలా కేర్ చేసింది. కరోనా నుంచి కోలుకోవడానికి నన్ను మానసికంగా శివజ్యోతినే తనని ధృడం చేసిందన్నారు. కోవిడ్-19 సోకిన సమయంలో ఆలాంటి మనుషుల మధ్య ఉండటంతో కరోనా పెద్దగా నన్ను ఏమి చేయలేక పోయింది. శివజ్యోతి అక్క.. బావల కాళ్లు మొక్కినా తప్పులేదు” అంటూ రవికృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. ఈ సమయంలోనే శివజ్యోతి కూడా స్టేజిపైకి చేరి ఎమోషనల్ అయింది. కరోనా వచ్చిన సమయంలో మీకు ఎలా అనిపించింది? అని యాంకర్ రవి అడగ్గా ఈ విషయాలను వెల్లడించాడు రవికృష్ణ. దీంతో అక్కడున్ను వారితో పాటు ప్రేక్షకులు సైతం కన్నీరు పెట్టించాడు రవికృష్ణ.