తెలుగు టెలివిజన్ చరిత్రలో ఏ రియాలిటీ షో కి సాధ్యం కాని రీతిలో అతి కొద్దికాలంలోనే అత్యంత ప్రజాదరణ సంపాదించుకున్న బిగ్ బాస్ ఓటింగ్ విషయంలో సీజన్ సీజన్ కు దూసుకుపోతోంది. ఒక సీజన్ ను మించిన టిఆర్పి రేటింగ్స్ ను మరొక సీజన్లో సాధిస్తున్న ఈ షో పైన విమర్శలు కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. విషయం ఏమిటంటే ఈ షో లో టిఆర్పి పెంచేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, డబల్ ఎలిమినేషన్, సీక్రెట్ టాస్క్ లు, కన్ఫెషన్ రూమ్ లో వీడియోలు వంటివి నిర్వాహకులు చేస్తుంటారు.
ఇదే క్రమంలో వారు మరొక ట్రిక్ ప్లే చేసినట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా బయటకు వచ్చిన తర్వాత అతనిని స్టేజి పైన పిలిచి గుడ్ బై చెప్పే ముందు జరిగిన తంతు గురించి అందరికీ తెలిసిందే. అవినాష్ రాజశేఖర్ పైన నోయల్ ఎన్నడూ లేని విధంగా ఫైర్ కావడం వారు కూడా తిరిగి అతనిని నిందించడంతో నిన్నటి ఎపిసోడ్ కాస్తా హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ అయింది. అయితే దీన్ని మొత్తం ముందే బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేశారని చెబుతున్నారు.
ఎందుకంటే నోయల్ ఇంటిలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఈ విషయం గురించి ప్రస్తావించలేదు. ఒక్కసారిగా స్టేజి పైకి అలా వచ్చిన అతను కటువుగా మాట్లాడటం…. టిఆర్పి కోసం నిర్వాహకులు వేసిన ప్లాన్ అని అంటున్నారు. ఇంటిలో నుంచి బయటికి వెళ్లేముందు అవినాష్ లాంటి మంచి కంటెస్టెంట్ పైన నిందలు వేయడం…. అమ్మ రాజశేఖర్ ఈ వారం ఎలిమినేట్ కాకుండా నో ఎలిమినేషన్ వీక్ చేయడం మొత్తం టిఆర్పి కోసమేనని…. ఇక వచ్చే వారం కూడా అవినాష్ రాజశేఖర్ కి సంబంధించిన క్లిప్పింగులు ఎక్కువగా ఎపిసోడ్ లో ప్రసారం చేస్తారని అంటున్నారు. మరి టిఆర్పీ కోసం బిగ్బాస్ వేసిన ఎత్తులు వారికి అవసరమైన టీఆర్పీని ఇస్తారో లేదో వేచి చూడాలి.