NTR: యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఏడాది నుంచి ఏడాదిన్నరలోపే రిలీజ్ చేయాలనుకున్న రాజమౌళికి అది సాధ్యపడలేదు. సాధారణంగా రాజమౌళి మామూలు కమర్షియల్ సినిమాలనే అనుకున్న సమయానికి రిలీజ్ చేయరనే ఓ టాక్ ఉంది. ఎందుకంటే ఆయన సినిమా క్వాలిటీ కోసం చాలా శ్రమిస్తారు. చివరి నిమిషం వరకు సినిమాను చెక్కుతూనే ఉంటారు. ఏమాత్రం సంతృప్తి కలగకపోయినా సినిమాను రిలీజ్ చేయరు.
అలాంటిది పాన్ ఇండియన్ సినిమా అంటే అందులోనూ ఎక్కువ భాగం గ్రాఫిక్స్తో కూడుకున్న కథాంశం అయితే ఇంకెలా ఉంటుంది. అందుకే బాహుబలి సినిమాలకు మాదిరిగానే ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో చాలా సమయం తీసుకున్నారు. కరోనా వల్ల ఆ సమయం రెట్టింపు అయింది. దాంతో దాదాపు తారక్, చరణ్, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్లోనే ఇరుక్కుపోయారు. ఈ నాలుగేళ్ళలో ఎలాంటి సమస్యలు లేకపోయి ఉంటే ఒక్కొక్కరు కనీసం నాలుగు సినిమాలతోనైనా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేవారు. ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నా కూడా ఆర్ఆర్ఆర్ వల్ల మొదలు పెట్టలేని పరిస్థితి.
NTR: ప్రశాంత్ నీల్ లేదా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా..!
అయితే, ఈ మూడేళ్ళ గ్యాప్ను తారక్, చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చి ఫుల్ ఫిల్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే చరణ్ ..శంకర్ సినిమాను సెట్స్ మీదకి తీసుకువచ్చాడు. అలాగే గౌతం తిన్ననూరి సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. అలాగే ఎన్.టి.ఆర్ నెక్స్ట్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్నీ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక సెట్స్ మీదకు తీసుకు రావడమే తరువాయి. అలాగే ప్రశాంత్, నీల్ లేదా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇలా రెండు సినిమాలను సమాంతరంగా కంప్లీట్ చేసి చిన్న గ్యాప్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.