Chiranjeevi: శృతి హాసన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలె గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలయ్య బాబు నటిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకోవటం తెలిసిందే. కాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో హీరోయిన్ అవకాశం అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అవ్వటం తెలిసిందే. అయితే నేడు మహిళా దినోత్సవం సందర్భంగా… శృతి హాసన్ సినిమాలో హీరోయిన్ అని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ప్రారంభం నుండి సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వచ్చిన వార్తలపై సినిమా యూనిట్ పెద్దగా స్పందించలేదు. కాగా నేడు మహిళా దినోత్సవం రోజున… శృతిహాసన్ సినిమాలో హీరోయిన్ అని.. తెలియజేస్తూ ఫోటో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవికీ బొకే అందించి సినిమా సెట్ లో శృతిహాసన్ అడుగుపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ భామ కీలక ప్రాజెక్టులు చేస్తూ ఉంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమాతో పాటు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సలార్.. కాగా తాజాగా మెగా స్టార్ చిరంజీవి తో సినిమా ఒప్పుకోవడంతో.. మూడు కీలకమైన ప్రాజెక్టు లలో… శృతిహాసన్ దూసుకుపోతూ ఉంది. ఇక ఇదే సమయంలో కరోనా తీసుకొచ్చిన గ్యాప్ కారణంగా.. వరుసపెట్టి సినిమాలను చిరంజీవి ఒప్పుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య ఈ వేసవిలో రిలీజ్ కానుండగా.. మరోపక్క గాడ్ ఫాదర్, బోలా శంకర్ సినిమాల షూటింగ్ చిరంజీవి స్టార్ట్ చేయడం గమనార్హం.