పలు హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న శ్రీరాం లగూ(92) వయోభారంతో పుణెలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. థియేటర్ ఆర్టిస్ట్గా కెరీర్ను స్టార్ట్ చేసిన ఆయన ఇరవైకి పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు.ఆయన నటుడిగా కాకుండా ఈఎన్టీ సర్జన్గా, సామాజిక కార్యకర్తగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. శ్రీరాం లగూ మృతిపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందిస్తూ గొప్ప నటుడు, గొప్ప వ్యక్తిని కోల్పోయమని తెలిపారు. ఈయన మృతిపై బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.