Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి జోరుమీద ఉన్నారు. రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” చేస్తుండగానే .. చాలా సినిమాలు లైన్ లో పెట్టడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇటీవల “వకీల్ సాబ్” రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవటం తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ వచ్చినా .. బాక్సాఫీస్ దగ్గర మాత్రం తన జోరు తగ్గలేదు అన్న రీతిలో పాండమిక్ సీజన్లో రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొట్టాడు. ఇదిలా ఉంటే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా పవన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ “వకీల్ సాబ్” సినిమా జరుగుతుండగానే.. స్టార్ట్ అవ్వడం జరిగింది. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గజదొంగ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాలో మొత్తం మూడు క్యారెక్టర్ లలో పవన్ కనిపించనున్నట్లు వార్తలు సినిమా యూనిట్ నుండి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ వార్త ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం వెల్లడించారు. హరిహర వీరమల్లు నెక్స్ట్ షెడ్యూల్ కోసం పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నారని స్పష్టం చేశారు.
Read More: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ కోసం సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న హరీష్ శంకర్..!!
దాదాపు సినిమాకి సంబంధించి షూటింగ్ 50 శాతం కంప్లీట్ అయిందని మిగతాదంతా త్వరలోనే కంప్లీట్ అవుతుందని ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అర్జున్ రామ్ పాల్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు పాల్గొంటున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి మిగతా మొత్తం కంప్లైంట్ చేయడం జరుగుతుందని ఏఎం రత్నం స్పష్టం చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.