Akkineni Nagarjuna : తెలుగు ఇండస్ట్రీ మన్మధుడిగా ఎంతో గుర్తింపును సంపాదించుకున్న అక్కినేని నాగార్జున తాజాగా మన్మధుడు సినిమాకు సీక్వెల్ గా మన్మధుడు 2 చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత నాగార్జున వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. నాగార్జున సోగ్గాడే చిన్నినాయన వంటి సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ గా బంగార్రాజు అనే సినిమాను చేయబోతున్నాడని సమాచారం గత కొద్దిరోజుల నుంచి వినబడుతోంది. నాగార్జున గారితో బంగార్రాజు చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్నారు.
బంగార్రాజు చిత్రంలో మాత్రమే కాకుండా తర్వాత నాగార్జున ఓ యాక్షన్ తరహా సినిమా చేయబోతున్నట్లు సమాచారం వినబడుతోంది. రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన గరుడవేగ ఏ స్థాయిలో ప్రజలను ఆకట్టుకుందో అందరికీ తెలిసినదే. ఈ సినిమా దర్శకుడు ప్రవీణ్ సత్తారు నాగార్జున గారికి యాక్షన్ త్రిల్లింగ్ కథను చెప్పారు ఈ కథ నాగార్జునకు నచ్చడంతో ఈ సినిమా చేయడానికి నాగార్జున ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
తొందరలోనే ప్రవీణ్ సత్తారు_నాగార్జున సినిమా సెట్స్ పైకి వెళుతుందని సమాచారం జోరుగా వినబడుతుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించడానికి అనిఖా సురేంద్రన్ అనే కొత్త బ్యూటీ నాగ్ సరసన నటిస్తుందని సమాచారం వినబడుతుంది. అదేవిధంగా ఈ సినిమాలో మరో రకమైన కీలక పాత్రలో బాలీవుడ్ బ్యూటీ గుల్ పనాగ్ నటించబోతున్నారని సమాచారం. ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే
గుల్ పనాగ్ తొలి తెలుగు సినిమా ఇదేనని చెప్పవచ్చు. నాగార్జున చేయబోయే యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని శరత్ మరార్ తో కలిసి ఏషియన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!