Mahesh Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు తెరకెక్కాయి. ఆ రెండు సినిమాలు కూడా మహేష్ లో ఉన్న కొత్త నటన కోణాన్ని బయటపెట్టాయి. “అతడు” లో మహేష్ లో ఉన్న.. ప్రొఫెషనల్ నటన తల మీద త్రివిక్రమ్ చూపించగా ఆ తరువాత ఖలేజాలో మహేష్ లో ఉన్న కామెడీ యాంగిల్ ని బయటకు తీయడం జరిగింది. ఖలేజా తర్వాత మహేష్ నటించిన చాలా సినిమాలు కామెడీ పరంగా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఖలేజా సినిమా రాకముందు వరకూ కామెడీ పరంగా మహేష్ చాలా వీక్ అనే టాక్ ఇండస్ట్రీ లో ఉండేది.
కానీ ఖలేజాతో తమలో ఉన్న కామెడీ యాంగిల్.. సరికొత్తగా బయటకు తీసి … ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు. కాగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా.. ఏప్రిల్ మాసంలో షూటింగ్ స్టార్ట్ కానుందట. పాన్ ఇండియా నేపద్యంలో సినిమా తీయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరో నీ విలన్ పాత్రలో చూపించటానికి త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు సునీల్ శెట్టి. ఇప్పటికే సునీల్ శెట్టి మంచు విష్ణు మోసగాళ్ల తో పాటు.. త్వరలో రిలీజ్ కానున్న వరుణ్ తేజ్ నటించిన “గని” సినిమాలో కూడా నెగటివ్ పాత్రలు చేయడం జరిగింది.
దీంతో మహేష్ సినిమాలో కూడా సునీల్ శెట్టి చేత నెగిటివ్ పాత్ర చేయించటానికి.. విలన్ గా చూపించడానికి త్రివిక్రమ్.. డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మూడో సారి త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేస్తున్న నేపథ్యంలో సినిమా స్టోరీ ఏ తరహాలో ఉంటుందన్నది.. ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. సినిమా షూటింగ్ దాదాపు క్లైమాక్స్ కి చేరుకుంది. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం RRR విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో సంక్రాంతి పండుగకు మహేష్ పక్కకు తప్పుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే త్వరలోనే సర్కారు వారి పాట సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మాసం నుండి తిరిగి “త్రివిక్రమ్” సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!