Prabhas: భారతీయ చలనచిత్ర రంగంలో అతిథ్యం ఇవ్వటంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తీరే వేరు. తాను చేయబోయే సినిమా యూనిట్ విషయంలో ఎప్పటికప్పుడు భోజనాలు ఏర్పాటు చేస్తూ సకల రుచులు పెడుతూ ఎంతో సర్ప్రైజ్ చేస్తాడు. తన చుట్టుపక్కల మనుషులంతా సంతోషంగా ఉండాలని కోరుకునే ప్రభాస్… ఆతిథ్యమిచ్చి వారిని ఆనందింప చేయటంలో ఎప్పుడు తన ప్రత్యేకత చాటుకుంటాడు. ప్రభాస్ తో కలిసి పనిచేసిన దర్శకులు.. నటీనటులు ఇంకా స్నేహితులు అతడి ఇచ్చే ఆతిథ్యం మరియు భోజనాల గురించి చాలా సందర్భాలలో వివిధ వేదికలపై కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి.
సరిగ్గా ఈ రకంగానే బాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రభాస్ భోజనాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసిన సమయంలో… వాళ్లు అడిగిన ప్రశ్నలకు కంగనా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది. వీటిలో ఓ ప్రశ్న ప్రభాస్ తో మరోసారి మీరు సినిమా చేసే అవకాశం ఉందా.. ? అతనితో కలిసి పనిచేసిన సమయంలో ఒక తీపి జ్ఞాపకం పంచుకోగలరా అని ప్రశ్న వేశారు. దీనికి కంగనా స్పందిస్తూ అతడు మంచి ఆతిథ్యం ఇస్తాడు.
ప్రభాస్ ఇంటి భోజనం చాలా అద్భుతంగా ఉంటుంది అని స్పష్టం చేసింది. 2009వ సంవత్సరంలో ప్రభాస్ కంగనా రనౌత్ కాంబినేషన్ లో “ఏక్ నిరంజన్” వచ్చింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ సినిమాలో సాంగ్స్ మరియు ఫైట్లు ప్రేక్షకులను అలరించాయి. తెలుగులో కంగనాకీ ఇది తొలి సినిమా. ఈ సినిమా పరాజయం పాలు కావడంతో… ఏక్ నిరంజన్ తోనే టాలీవుడ్ లో అవకాశాలు ఆగిపోయాయి. ఆ తర్వాత యధావిధిగా బాలీవుడ్ లో అవకాశాలు అందుకుని.. ఇప్పటికీ కూడా టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.