Prabhas: సాధారణంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు బాలీవుడ్ గురించే మాట్లాడుకునేవారు ప్రపంచ సినీ ప్రేమకులు. కానీ ఎప్పుడైతే రాజమౌళి దర్శకత్వంలో “బాహుబలి” విడుదల అయ్యి బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు అన్ని ఇండస్ట్రీలలో రికార్డులు పగలగొట్టడం జరిగిందో అప్పటినుండి ప్రభాస్ పేరు మారుమ్రోగుతోంది. “బాహుబలి” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి నెక్స్ట్ లెవెల్ లో కి తీసుకెళ్లగా తెలుగు సినిమా సత్తా ఏంటో కూడా నిరూపించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమ్రోగుతోంది. బాహుబలి రాకముందు ముగ్గురు ఖాన్ ల పేర్లు బాలీవుడ్ ఇండస్ట్రీ పేరు గట్టిగా వినబడేది. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి దేశవ్యాప్తంగా ప్రముఖులు పొగుడుతున్నారు.
ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాద్ పర్యటన సమయంలో… తెలుగు సినిమా సత్తా గురించి పొగడ్తల వర్షం కురిపించడం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్ ఎప్పుడూ కూడా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా చిన్నచూపు చూస్తూ ఉంటుంది అని చాలామంది సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖులు గతంలో తెలియజేయడం జరిగింది. గతంలో వజ్రోత్సవం కార్యక్రమంలో చిరంజీవి కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. గోవా ఫిలిం ఫెస్టివల్స్ ఇంకా చాలా చోట్ల దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు అప్పట్లో గౌరవం ఇవ్వలేదని చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అటువంటిది ఇప్పుడు బాలీవుడ్ .. టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.
దానికి కారణం రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన “బాహుబలి”. దీంతో రాజమౌళి పాపులారిటీ తోపాటు ప్రభాస్ క్రేజ్ దేశవిదేశాలలో పెరగింది. ఈ పరిణామంతో బాలీవుడ్ భామలు కూడా డార్లింగ్ తో సినిమా చేయడానికి ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఖాన్ ల హవా కొనసాగగా… ఇప్పుడు ప్రభాస్ పేరు మారుమ్రోగుతోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ఎదుగుదల ఉన్న కొద్ది పెరుగుతూ ఉన్న తరుణంలో ఇటీవల విడుదలైన “రాధేశ్యాం” అట్టర్ ఫ్లాప్ కావడంతో… బాలీవుడ్ లో ప్రభాస్ పై ట్రోల్లింగ్ స్టార్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో మినిమం కలెక్షన్లు కూడా “రాధేశ్యాం” కి బాలీవుడ్ లో రాని పరిస్థితి నెలకొంది. మరోపక్క పాన్ ఇండియా సూపర్ స్టార్ గా క్రేజ్ సంపాదించిన ప్రభాస్.. సినిమా ప్లాప్ కావడంతో బాలీవుడ్ మీడియా సైతం “రాధేశ్యాం” పై సైటరికల్ గా వార్తలు కథనాలు భారీ ఎత్తున జరగటం ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.