Prabhas: మహమ్మారి కరోనా పాండమిక్ తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. RRR, KGF 2 రెండు సౌత్ సినిమాలు దాదాపు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం జరిగింది. కనీసం ఒక్కటంటే ఒక్క బాలీవుడ్ సినిమా కూడా సౌత్ సినిమాలకు పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ఇటువంటి తరుణంలో బాలీవుడ్ లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల పై.. సినిమాలపై రకరకాల వార్తలు ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ హవా ఓర్చుకోలేక విషం కక్కే రీతిలో కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నాయి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఛాన్స్ దొరికితే చాలు ఎవ్వరిని వదలటం లేదు. రాదేశ్యం అట్టర్ ఫ్లాప్ అయిన సమయంలో… ప్రభాస్ నీ తక్కువ చేస్తూ వార్తలు ప్రసారం చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ప్రభాస్ రెమ్యునరేషన్ పై బాలీవుడ్ మీడియా సరికొత్త వార్త ప్రసారం చేస్తోంది. మేటర్ లోకి వెళితే బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రభాస్ ఏకంగా 120 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు బాలీవుడ్ లైఫ్ మీడియా కధనం చెబుతోంది.
ఈ సినిమాకి ముందు 90 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల మధ్య ప్రభాస్ పారితోషికం ఉండేదని కానీ ఇప్పుడు.. బాలీవుడ్ నిర్మాతల నుండి 120 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని.. ఆ కథనం యొక్క సారాంశం. ఈ పరిణామంతో సినిమా బడ్జెట్ ఒక్కసారిగా 25 శాతం పెరిగిందని ఈ పరిస్థితితో బాలీవుడ్ నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారని.. ఆ కథనంలో వార్తలు ఉన్నాయి. మరి వచ్చిన వార్తల్లో నిజం ఎంతో ఉన్నది తెలియాల్సి ఉంది. ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు.