NTR Prabhas: ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్(Prabhas) పేరు గట్టిగా వినబడుతుంది. బాహుబలి(Bahubali) సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన ప్రభాస్.. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే. ఇక ఇదే సమయంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) కూడా “RRR” తో పాన్ ఇండియా లెవెల్ లో మార్కెట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇద్దరికీ మాస్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు ప్రభాస్ ఎన్టీఆర్ ల చేత ఒక బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి బాలీవుడ్ బడా నిర్మాత అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు టాక్.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ నిర్మాత మరెవరో కాదు కరణ్ జోహార్(Karan Johar). ఇద్దరు హీరోలకు మాసులో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని సరైన కథ కోసం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు స్టార్ దర్శకుల నుండి స్టోరీలు వింటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ఓవర్సీస్ లో సినిమా రివ్యూలు రాసే ప్రముఖుడు.. ఫిలిం క్రిటిక్ ఉమైర్ సందు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ప్రస్తుతం కరణ్ మంచి కథ కోసం వెతుకులాడుతున్నట్లు అంత ఓకే అయితే ఎన్టీఆర్, ప్రభాస్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, నాగ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్టు కే” సినిమా చేస్తున్నరు. ఇక ఎన్టీఆర్ RRR తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఏది ఏమైనా మల్టీస్టారర్ నేపథ్యంలో పెద్ద పెద్ద హీరోలు కలిసి సినిమాలు చేయడానికి ముందుకు రావడం.. అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది.