T.V Actor: ప్రస్తుత కాలంలో ఎంతోమంది వారి రోజు జీవనాధారం కోసం ఎన్నో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు మాత్రం అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసును లాకెళ్ళి పోవడం గురించి ఎన్నో సార్లు వినేఉన్నాం. తాజాగా ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాకెళ్తు ఓ యువ నటుడుని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే..
సూరత్ లోని రోడ్డు పై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని మెడలో గొలుసులు లాకెళ్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరూ ప్రముఖ వ్యక్తులని గుర్తించారు. ఇద్దరు నిందితులలో ఒకరు టీవీ యాక్టర్ గా పని చేయగా మరొకరు బిల్డర్ అని తెలుస్తోంది. ఇద్దరికి క్రికెట్ అంటే ఎంతో పిచ్చి ఉండటంతో క్రికెట్ పై బెట్టింగులు కడతూ అప్పుల్లో కూరుకుపోయారు. ఇద్దరు నిందితులలో బిల్డర్ పై ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ మధ్యకాలంలో సూరత్ లో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో వీటిపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులకు ఈ ఇద్దరు నిందితులు దొరికారు.
మిరాజ్ కపాడియా, వైభవ్ జాదవ్:
చైన్ స్నాచింగ్ కేసుల్లో పోలీసులకు పట్టుబడిన ఇద్దరు నిందితులలో వైభవ్ జాదవ్ అనే వ్యక్తి బీఎస్సీ కెమిస్ట్ గా పని చేస్తున్నారు. మరొకరు మిరాజ్ కపాడియా అనే వ్యక్తి పలు టీవీ సీరియల్స్ లో నటించేవారు. వీరిద్దరూ కలిసి నగర వీధులలో కార్లు కూడా దొంగలించే వారు. క్రికెట్ పై అధిక పిచ్చి ఉండటంతో ఎక్కువ అప్పులపాలైన ఇద్దరు ఈవిధంగా దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే సుసాం రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడలో చైన్ లను లాక్కొని పారిపోతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు వీరిపై అనుమానం రాగ వీరిని అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు తెగిపోయిన బంగారు గొలుసులను,2.5 లక్షల రూపాయల డబ్బులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.