Rajamouli Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” చేస్తున్న సంగతి తెలిసిందే. మే 12వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. ఒక్క సాంగ్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ చేస్తోంది. “పోకిరి” తరహాలో సినిమా ఉంటుందని మహేష్ చెప్పటంతో “సర్కారు వారి పాట” పై మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
పైగా ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన కళావతి, పెన్నీ పాటలు సూపర్ డూపర్ హిట్ కావడంతో… ఉన్న కొద్దీ అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట తర్వాత మహేష్ త్రివిక్రమ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. జూన్ మాసంలో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా మహేష్ చేయనున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు .. రాజమౌళి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఇదిలా ఉంటే ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత మహేష్ బాబుతో టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన స్టార్ మాస్ డైరెక్టర్.. బోయపాటి శ్రీను సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. ఒక కమర్షియల్ స్టోరీ మహేష్ కోసం బోయపాటి రెడీ చేసినట్లు.. ప్రస్తుతం డిస్కషన్ జరుగుతున్నట్టు అంతా ఓకే అయితే రాజమౌళి తో తర్వాత … ఈ సినిమా మహేష్ తో చేయాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతుంది.