తన సినిమాల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టి, హీరోలతో అదిరిపోయే డైలాగులు చెప్పించి మాస్ ని మెప్పించిన దర్శకుడు బోయపాటి శ్రీను. బోయపాటి నుంచి సినిమా వస్తుంది అంటేనే బీ, సీ సెంటర్లు విజిల్స్ మోతమోగిపోతాయి అందుకే అతనికి ఫ్లాప్స్ తక్కువ. ఒక సినిమా నిరాశపరిచినా కూడా నెక్స్ట్ మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యే బోయపాటి శ్రీను, రీసెంట్ గా చేసిన సినిమా వినయ విధేయ రామ.
చరణ్-బోయపాటి కలయికలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే భారీ నెగటివ్ టాక్ తెచ్చుకోని బయ్యర్లకి నష్టాలు మిగిలించింది. వినయ విధేయ రామ చూసిన ప్రతి ఒక్కరూ బోయపాటి శ్రీను పని అయిపోయిందని, ఇక సినిమాలు మానేయాలని విమర్శిస్తున్నారు. ఈ కామెంట్స్ తన వరకూ వెల్లయేమో కానీ సంక్రాంతి తర్వాత బోయపాటి బయటకి రాలేదు. తను నెక్స్ట్ నందమూరి బాలకృష్ణతో చేస్తున్న సినిమా కోసం కథని పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్న బోయపాటి శ్రీను, విమర్శించిన వాళ్లతోనే కాంప్లిమెంట్స్ పొందాలని చూస్తున్నాడట. హిట్ కొట్టాలనే కసితో ఉన్న బోయపాటి శ్రీను, ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ని ఫాలో అవుతున్నాడు.
గతేడాది ఇదే టైమ్ కి త్రివిక్రమ్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పవన్ కళ్యాణ్ 25వ సినిమా కావడం, దానికి త్రివిక్రమ్ డైరెక్టర్ కావడం అజ్ఞాతవాసిపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. బాక్సాఫీస్ దగ్గర కొత్త చరిత్ర ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు కానీ రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయ్యింది. అజ్ఞాతవాసి సినిమా టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఈ రిజల్ట్ తో అప్పటి వరకూ మాటల మాంత్రికుడిగా అందరితో మన్ననలు అందుకున్న త్రివిక్రమ్ పై చాలా విమర్శలు వినిపించాయి. త్రివిక్రమ్ పని అయిపోయిందన్న వారూ కూడా ఉన్నారు. కెరీర్ మొత్తంలో విమర్శ అనే మాటే ఎరుగని త్రివిక్రమ్, అజ్ఞాతవాసి దెబ్బకి నిజంగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సరిగ్గా 10 నెలల తర్వాత మాటల మాంత్రికుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి అరవింద సమేత వీర రాఘవ చేశాడు. తనని తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకుంటూ ఎన్టీఆర్ ని ముందెన్నడూ చూడని విధంగా చూపించిన త్రివిక్రమ్ భారీ హిట్ అందుకున్నాడు. విమర్శించిన వాళ్లే అరవింద సమేత సినిమా చూసి త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అన్నారు.
ఇప్పుడు ఇదే రూట్ ఫాలో అవ్వాలని చూస్తున్న బోయపాటి శ్రీను, బాలయ్య సినిమాని కూడా దసరా టైంకి రెడీ చేసి, హిట్ ఇచ్చి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. బాలయ్యకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కథని, లెజెండ్ ని మించే సినిమాని ఇవ్వాలని భావించిన బోయపాటి శ్రీను, అందుకు తగ్గట్లు గానే కథని సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు కాబట్టే బయటకి రావట్లేదని శ్రీను సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఈ ఇద్దరి దర్శకులపై విమర్శలు రావడానికి మెగా హీరోల సినిమాలే కావడం విశేషం. మరి నందమూరి హీరోని నమ్ముకొని త్రివిక్రమ్ కంబ్యాక్ ఇచ్చినట్లే బోయపాటి శ్రీను కూడా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.