Boyapati Srinu: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. 2005లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన `భద్ర` సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బోయపాటి.. ఆ తర్వాత తులసి, సింహా, దమ్ము, లెజెండ్, సరైనోడు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు.
ఇక బోయపాటి రీసెంట్గా రూపొందించిన చిత్రం `అఖండ`. నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రజ్ఞ జైస్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై మంచి విజయం సాధించింది. ఓవైపు కరోనా విజృంభిస్తున్నా ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటికీ కొన్ని కొన్ని ఏరియాల్లో ఈ మూవీ కలెక్షన్స్ను వసూల్ చేస్తూనే ఉంది.
ఇదిలా ఉంటే.. అఖండ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఖాతాలో వేసుకున్న బోయపాటి తాజాగా తన రెమ్యునరేషన్ను భారీగా పెంచేశాడట. ఈయన తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్తో చేయనున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి గానూ బోయపాటి ఏకంగా రూ. 12 కోట్లను పారితోషకంగా అందుకుంటున్నాడని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సింది ఉంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!