2005లో బోయపాటి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన “భద్ర” సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. యాక్షన్ నేపథ్యంలో ప్రేమ కథ తరహాలో బోయపాటి తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేయడం జరిగింది. దిల్ రాజు నిర్మాణ సాధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ సినిమా మొత్తానికి హైలైట్. హీరోయిన్ మీరాజాస్మిన్ తన పాత్రలో ఇమిడిపోయింది. ఈ క్రమంలో తాజాగా అసలు ఈ సినిమా స్టోరీ ఫస్ట్ బోయపాటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి చెప్పడం జరిగిందంట. అయితే అప్పట్లో బన్నీ ఈ కథని రిజెక్ట్ చేయడంతో.. బోయపాటి రవితేజతో చేయడం జరిగిందట.
వాస్తవానికి ఆ టైములో అల్లు అర్జున్… వివి వినాయక్ దర్శకత్వంలో “బన్నీ” సినిమా చేయటం జరిగింది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. బన్నీ కెరియర్ లోనే అప్పట్లో రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టింది. భద్ర, బన్నీ ఒకే ఏడాదిలో విడుదల కావడం జరిగింది. రెండు కూడా వేసవికాలంలోనే రిలీజ్ అయ్యాయి. నెల గ్యాప్ లో విడుదలైన ఈ రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు రాబట్టాయి. అయితే ఈ సినిమా మిస్ చేసుకున్న తర్వాత బన్నీకి “సరైనోడు” స్టోరీ చెప్పి తీసి బోయపాటి హిట్ అందుకున్నారు.
బన్నీ కెరియర్ లోనే “సరైనోడు” అత్యంత హైవోల్టేజ్ మాస్ సినిమా. ఇదిలా ఉంటే మరోసారి బోయపాటి ఐకాన్ స్టార్ బన్నీతో సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం బోయపాటి ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో పాన్ ఇండియా నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే… సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప 2” చేయటానికి రెడీ అవుతున్నారు.