టీవీ పరిశ్రమలో ఈ మధ్య వచ్చినంత ఉనికి గతంలో లేదు అనే చెప్పాలి. జబర్దస్త్ కామెడీ షో పెట్టిన తర్వాత మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు ఎంతో విస్తృతంగా దానిలో ఉన్న ఎలిమెంట్ ని మిగతా షో అన్నింటికీ ఆపాదించారు. అదే ఫన్ ఎలిమెంట్ మీద ఎన్నో కొత్త షో లను రూపొందించారు. లాక్ డౌన్ సమయంలో కూడా ఈ ఎపిసోడ్ ల ప్రభావం చాలానే ఉంది. అయితే అసలు విషయానికి వస్తే…
సుధీర్ వల్లే రిస్క్
కరోనా దెబ్బకు సినీ టీవీ పరిశ్రమలు విలవిలలాడిపోయాయి. వైరస్ ప్రభావం గతంతో పోలిస్తే తగ్గి జనాల్లో భయం కూడా తగ్గిపోయింది. ఇక టీవీ రంగంలో కూడా మంచి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్టిస్టులందరూ చేతులు కలిపి మళ్లీ అన్నీ షో లను పునః ప్రారంభించడం మొదలుపెట్టారు. ఇలా గత నెల రోజుల నుండి అందరినీ అలరిస్తున్న జబర్దస్త్, ఢీ ప్రోగ్రాం నిర్వాహకులు ఒక్కసారిగా వణుకు వచ్చింది. ఈ టీవీలో వచ్చే జబర్దస్త్, ఢీ ప్రోగ్రాం లలో కీలక వ్యక్తి అయిన సుడిగాలి సుధీర్ కు కరోనా వచ్చిందన్న వార్తలు బయటకు వచ్చాయి. రెండు రోజులుగా అతనికి లక్షణాలు కనిపిస్తుండటంతో అతడు వెళ్ళి పరీక్ష చేయించుకోగా అది కాస్తా పాజిటివ్ అని తేలింది.
మిగతా వాళ్ళ కథేంటి….?
వెంటనే ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుధీర్ తో పాటు కలిసి స్కిట్ లు చేసే రాంప్రసాద్, సన్నీ తదితరులు కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఇక ఇటీవలే ఢీ ప్రోగ్రాం షూటింగ్ లో పాల్గొన్న సుధీర్ తో పాటు సన్నిహితంగా ఉన్న వాళ్లకు కూడా పరీక్షలు జరిపారు. ప్రస్తుతానికైతే ఎవరికీ పాజిటివ్ అని రాలేదని అంటున్నారు. అయితే సుధీర్ తో సహా వీరంతా క్వాంరంటైన్ కి కి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరినీ పక్కన పెడితే సుధీర్ కనీసం రెండు మూడు వారాల పాటు జబర్దస్త్, ఢీ షో లలో కనిపించే అవకాశం లేనట్లే.
పెద్ద దెబ్బే….
ఇలాంటి సమయంలో ఎక్స్ ట్రా జబర్దస్త్ లో అతడి స్కిట్లు మొత్తానికి ఆగిపోయిన ఆశ్చర్యం లేదు అంటున్నారు. జబర్దస్త్ లో హైపర్ ఆది టీం హవా నడిస్తే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో సుధీర్ స్కిట్ లు హైలైట్ గా నిలుస్తాయి. మరోవైపు ఢీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అందులో ప్రముఖ టీం లీడర్ అయిన సుధీర్ లేకుండా షో జరగాలన్నా కామెడీ స్కిట్లు చేయాలన్నా చాలా కష్టం, మరి అతడు వచ్చేదాకా షూటింగ్ ఆపుతారా లేదా అతను లేని లోటుని ఎవరైనా పూడుస్తారా అన్నది వేచి చూడాలి.