టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదంటూ ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించి ఆ హీరో అభిమానుల ఆగ్రహానికి గురైన హీరోయిన్ మీరా చోప్రా ముప్పై వేల అసభ్యకరమైన సందేశాలు వచ్చాయట.స్వయంగా ఆమె ఈ విషయాన్ని మీడియాకు చెప్పి సోషల్ మీడియా అత్యంత చండాలంగా తయారైందని వ్యాఖ్యానించారు.జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనను అత్యంత అసభ్యంగా దూషిస్తూ ట్వీట్ చేస్తున్నారని తెలిపారు.
తనపై అత్యాచారం చేస్తామని ,మొహంపై యాసిడ్ జల్లుతామని, హత్య చేస్తామని ఇలా రకరకాలుగా బెదిరింపులతో కూడిన ట్వీట్లు వారు చేస్తున్నారని ఆమె వాపోయారు.తాను ఈ ప్రపంచంలో ఎవరి అభిమానిగా ఉండాలనేది తన ఇష్టమని ఆమె అన్నారు.తాను న్యాయం వైపే ఉంటానని,ఈ విషయంలో వ్యతిరేకించకుండా తాను మౌనంగా ఉంటే తాను కూడా తప్పు చేసినట్లే అవుతుందని ఆమె తెలిపారు.అందుకే హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులకు,తను నివాసం ఉంటున్న ఉన్న ఢిల్లీలోని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని మీరా చోప్రా వెల్లడించారు.హీరోలే తమ అభిమానులనుఅదుపు చేసుకోవాలని చేసుకోవాలని వారి సోషల్ మీడియా ఖాతాలను గమనించాలని మీరా చోప్రా సూచించారు. హీరోలను వారి అభిమానులు దేవుళ్లుగా చూస్తారని తప్పనిసరిగా హీరోల మాటలను వారు వింటారన్నది తన అభిప్రాయమని ఆమె తెలిపారు.గతంలో కూడా ఇలాంటివి జరిగాయని అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అవధులు దాటి ప్రవర్తిస్తున్నారని ఆమె అన్నారు. ఈ విషయంలో ఎంతవరకైనా వెళ్తానని కూడా మీరా చోప్రా స్పష్టం చేశారు.