Breaking: ఇపుడు ఎక్కడ విన్నా ఒకటే పదం వినబడుతోంది. అదే RRR. బాహుబలి తరువాత జక్కన్న దర్శకత్వంలో వస్తున్న సినిమా అవడంతో ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కరోనా వేరియంట్ దెబ్బేయడంతో సినిమా వాయిదా పడిన విషయం అందరికీ తెలిసినదే. లేదంటే రేపు గాక ఎల్లుండే ఈ సినిమా రిలీజ్ అయ్యుండేది. దాంతో సదరు హీరోల అభిమానులు కొంచెం డీలా పడిన పరిస్థితి ఏర్పడింది.
RGV: మీకు మీ డ్రైవర్ కి తేడా లేదా? జగన్ ని నిలదీసిన RGV!
ఇక ఇదే పెద్ద దెబ్బనుకుంటే, ఇపుడు తాజాగా జక్కన్నపైన ఒకరు కేసు వేశారు. అవును.. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రలను జక్కన్న వక్రీకరించారని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పశ్చిమ గోదావరికి చెందిన అల్లూరి సౌమ్య ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. అందువలన ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోర్టువారిని కోరింది.