డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ తన పూరి మ్యూజింగ్స్ తో పోడ్ క్యాస్ట్స్ లో చేప్పే విషయాలు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. ఊహించని విషయాలు చెప్పే పూరి భారతీయులు ఇప్పటికీ వ్యతిరేకించే ‘బ్రిటిష్’ గురించి గొప్పగా చెప్పాడు. బ్రిటిషర్లు.. భారతీయుల్ని చిత్రహింసలకు గురి చేసి, మన సంపద దోచుకెళ్లారని చదువుకున్న మనకు.. వారిలో ఉన్న మంచి కూడా ఉందని చెప్తున్నాడు. గతాన్ని పక్కనపెట్టి చూస్తే.. బ్రిటిషర్స్ లో మంచి ‘అడ్మినిస్ట్రేషన్’, ‘డిసిప్లిన్’, ‘డెడికేషన్’. అంతకుమించి ‘కసి’ ఉందన్నాడు. పది ఊళ్లలో ఆఫీసులు పెడితేనే నడపడం కష్టం. కానీ.. ప్రపంచంలోని 22 దేశాలు తప్పితే మొత్తం అన్ని దేశాల్ని ఆక్రమించారు బ్రిటిషర్స్.. అన్నాడు. ఇంకా..
ప్రస్తుత ఇంగ్లండ్ జనాభా 6.50కోట్లు. 16వ శతాబ్దంలో 50 లక్షలు కూడా ఉండకపోవచ్చు. నావికులు, సైనికులు కలిపి 15వేల మంది ఉండొచ్చు. వారిని రాయల్ నేవీ అనేవారు. ఇంగ్లండ్ కంటే 13 రెట్లు పెద్దదైన భారత్ ను ఆక్రమించారు. కారణం.. వారిలో ఉన్న ‘కసి’. మనం బావిలో కప్పల్లా ఇక్కడే ఉంటాం. కానీ.. వాళ్లు భారత్ లో రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించారు. ప్రపంచంలో అందరికీ షర్టు, ఫ్యాంట్ వేయడం నేర్పారు. వాళ్ల ఇంగ్లీష్ నేర్పారు. బారిస్టర్ చదివించారు. ఆక్రమించిన దేశాల్ని తమవిగా భావించారు. రోడ్లు, రైళ్లు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు నిర్మించి అభివృద్ధి చేసారు. కొన్ని వందల షిప్స్ అనేక దేశాల నుంచి లండన్ కు అప్ అండ్ డౌన్ ప్రయాణించేవి. ఇవన్నీ చేయాలంటే ఎంతో కసి, విజన్ ఉంటేనే కానీ సాధ్యం కాదు.
అయితే.. అన్ని దేశాల్లో అభివృద్ది కోసం చేసిన అప్పులు, ప్రతి దేశంలో స్వాతంత్ర్య పోరాటాలు, రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోవడంతో ఫెయిల్ అయ్యారు. దీంతో 1776లో అమెరికా మొదలు 1984 వరకూ ఒక్కో దేశానికి స్వాతంత్ర్యం ప్రకటించేశారు. అయితే.. ఒకే ఒక్క దేశం మాత్రం తమను వదిలి వెళ్లొద్దని వేడుకుంది. దీంతో అక్కడే ఉండి అభివృద్ది చేసి 1997లో స్వాతంత్ర్యం ఇచ్చేసారు. ఆ దేశమే ‘హంకాంగ్’. అందుకే ఆ దేశం ఈరోజు ఇలా ఉంది. కేవలం 50వేల మందితో ప్రపంచాన్ని గుప్పిట్లో తీసుకోవడం మామూలు విషయం కాదు. శత్రువుల్లో మంచి ఉంటే నేర్చుకోవచ్చు. బ్రిటిష్ దగ్గర ఉంది ‘అడ్మినిస్ట్రేషన్, కసి’ అని చెప్పుకొచ్చాడు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!