ముకుంద సినిమాలో గోపికమ్మా.. చాలును లేమ్మా.. అనే పాటకు ఆ ముద్దుగుమ్మ వేసిన స్టేప్పులు నేటికి స్పెషలే.. తను ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. వరుస ప్రాజెక్టులతో బిజిబిజిగా ఉంటున్న ఆ అందాల తారే పూజా హెగ్దే. ఈ చిన్నది తన అందం, అభినయంతో కుర్రకారులను ఒక ఊపు ఊపి తన వైపు తిప్పుకుంది. రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేల్ రాణి.. అనే పాటకు తనేసిన స్టేపులకు కుర్రకారు ఆమె మాయలో పడిపోయారు.
ఈ ముద్దుగుమ్మ సముద్ర తీరప్రాంతంలో గులక రాళ్లను వేరుతున్న ఫొటోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. సముద్ర తీరంలో ముసిముసి నవ్వులు నవ్వుతు గులక రాళ్లను వేరుతుండగా తీసిన ఫొటోకు అందరూ ఫిదా అవుతున్నారు. బ్లాక్ షూట్ విత్ బ్లూ మిక్స్ డ్ డ్రెస్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ భలే ఉందని తన అభిమానులు మురిసిపోతున్నారు.ఈ స్టిల్ ను ఇన్ స్టా లో షేర్ చేస్తూ.. సముద్రం నుంచి నేర్చుకుంటున్నాం అనే క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కరు కొడుతోంది.
ఈ జిగెల్ రాణి ప్రస్తుతం అఖిల్ తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే డార్లింగ్ ప్రభాస్ రాబోయే చిత్రమైన రాధేశ్యామ్ లో కూడా నటిస్తోంది. అలాగే రోహిత్శెట్టి దర్శకత్వంలో వస్తున్న సర్కస్ సినిమాలో కూడా యాక్ట్ చేస్తోంది. ఈ చిత్రాలు కూడా ముందు సినిమాల్లాగే హిట్ ఇచ్చి పూజాకు పేరు తెస్తాయా లేదా అనేది వేచి చూడాలి. ఆమె అభిమానులు మాత్రం సినిమాలు హిట్ అవుతాయని నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!