NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20వ తారీకు సందర్భంగా కొరటాలతో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ కావడం తెలిసిందే. చాలా పవర్ఫుల్ మాస్ నేపథ్యంలో స్టోరీ అని రిలీజ్ అయిన వీడియో బట్టి బయట గట్టిగా నడుస్తుంది. అంతమాత్రమే కాదు ఇది కూడా కొరటాల మార్క్ మెసేజ్ ఓరియంటడ్ సినిమానే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి ఉండకూడదు అని, అప్పుడు తెలియాలి భయానికి తాను రావలసిన సమయం వచ్చిందని.. వీడియో లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు వైరల్ గా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొత్తం మీద మాస్ కథాంశం నేపథ్యంలో పవర్ఫుల్ క్యారెక్టర్ లో వీడియో లో రెండు కత్తులు పట్టుకుని ఎన్టీఆర్ స్టిల్ మొత్తం కనిపించకపోయినా ఆఫ్ కనిపించటం..తో ఫ్యాన్స్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ తో చేస్తున్న కొరటాల శివ సినిమా థీం… అప్పట్లో బన్నీ తో కొరటాల ఒప్పుకున్న సినిమా మాదిరిగా ఉందని సందేహం లేవనెత్తారు.
సరిగ్గా సముద్రం మధ్యలో పడవపై అల్లు అర్జున్ నిలబడినట్లు… అప్పట్లో ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. కాగా ఇప్పుడు సరిగ్గా ఇదే తరహాలో వైజాగ్ బీచ్ అన్న విధంగా తారక్ సముద్రం ఓడ్డులో… డైలాగులు చెప్పే బ్యాక్గ్రౌండ్ రావడంతో..ఇది బన్నీ ప్రాజెక్ట్ అని… బన్నీ అభిమానులతో పాటు మిగతా వాళ్లు కూడా డౌట్ పడుతున్నారు. ఏదిఏమైనా జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ మంచి పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో… కొరటాల తారక్ తో సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.