Allu Arjun: “అలా వైకుంఠపురంలో” సినిమా రాకముందు దాదాపు కొన్ని సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకున్న బన్నీ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. 2020 ప్రారంభంలో “అలా వైకుంఠపురం లో” సినిమా చేసిన అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా సినిమా “పుష్ప” చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ తో స్క్రిప్టులకు చేయగా ఇప్పుడు మరోసారి తన కెరీర్ లో “సరైనోడు” లాంటి బ్లాక్ బస్టర్ అందించిన డైరెక్టర్ బోయపాటి తో బన్నీ సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.
ఇటీవలే బోయపాటి అల్లు అర్జున్ కి స్క్రిప్ట్ వినిపించినట్లు అంతా ఓకే అయినట్లు ఈ సినిమాని .. బన్నీ హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ నిర్మించనున్నట్లు సమాచారం. సరైనోడు సినిమా లో బన్నీలో మాస్ ఎలివేషన్స్ అదరగొట్టే రీతిలో స్క్రీన్ మీద బోయపాటి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే రీతిలో మరోసారి మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read More: Pushpa: సోషల్ మీడియాలో మరో రికార్డు సృష్టించిన “పుష్ప”..!!
ప్రస్తుతం బోయపాటి నందమూరి బాలయ్య తో “అఖండ” చేస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. మరోపక్క పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఉండటంతో పాటు మధ్యలో కొరటాల మూవీ ఉన్న … కొరటాల ఎన్టీఆర్ 30వ సినిమా చేస్తూ ఉండటం తో ఈ మధ్యలో గ్యాప్ లో.. బోయపాటి ప్రాజెక్టు పట్టాలు ఎక్కించడానికి అల్లు అర్జున్ సిద్ధమవుతున్నట్టు టాక్.