Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా ప్రాజెక్టు ” పుష్ప” ప్రపంచవ్యాప్తంగా అనేక సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ వేసిన స్టెప్పులు… పలికిన డైలాగులు… మేన రిజమ్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యాయి. “శ్రీ వల్లీ” సాంగ్ స్టెప్…ఇంకా “తగ్గేదెలా”… ఇంటర్నేషనల్ క్రికెటర్ లు అదేవిధంగా చాలామంది స్టార్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఈమిటెట్ చేయడం మనం చూశాం. “పుష్ప” హవా ఇంకా కొనసాగుతూనే ఉంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే “పుష్ప” సెకండ్ చాప్టర్.. వచ్చే వేసవిలో రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమా విడుదల కాకుండానే బన్నీ రష్మిక మందన మరోసారి దర్శనం ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే కరణ్ జోహార్ చోటి బన్నీ- రష్మిక త్వరలో రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరణ్ జోహార్ షో గతంలో టీవీలో ప్రసారమయ్యే ది. కానీ ఈ సారి..ఓటిటిలో స్ట్రీమ్ కానుందని… ప్రపంచవ్యాప్తంగా బన్నీ – రష్మిక జంట “పుష్ప”తో పాపులర్ కావడంతో… తన షోకి మరింత గ్లామర్ ప్రపంచ వ్యాప్తంగా వస్తుందని కారణం ఈ విధంగా ప్లాన్ చేసినట్లు టాక్. “పుష్ప” సెకండ్ చాప్టర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందట.
ఏకధాటిగా షూటింగ్ స్టార్ట్ చేసి డిసెంబర్ నెల కల్ల.. ప్లీజ్ చేయాలని సుకుమార్ డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే “పుష్ప” ఫస్ట్ పార్ట్ కి పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా కానీ బాలీవుడ్ లో భారీగా కలెక్షన్స్ వచ్చాయి. కాని “పుష్ప” సెకండ్ చాప్టర్ కి ఎక్కువ ప్రమోషన్ కార్యక్రమాలు జరిగేలా సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్ కంప్లీట్ అయ్యాక దాదాపు రెండు నెలలపాటు ప్రమోషన్ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సుకుమార్ “పుష్ప” సెకండ్ చాప్టర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్లు.. కథలో మరింత మెరుగులు దిద్దినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. “పుష్ప” మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ కావటంతో.. రెండో భాగం అత్యధిక భాషల్లో రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ పక్కా ప్లానింగ్ తో ఉంది.