స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఇప్పుడు `అల…వైకుంఠపురములో..` సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసుకుని ఉండటంతో ఎంటైర్ యూనిట్ చిత్రీకరణను పూర్తి చేయడానికి పరుగులు తీస్తుంది. కాగా ఈ సినిమాతో ఫ్యాన్స్కు, ప్రేక్షకులకు బన్నీ ఓ షాక్ ఇవ్వాలనుకుంటున్నాడట. అదేంటంటే.. ఓ ప్రత్యేకమైన సందర్భంలో శ్రీకాకుళ జానపద గీతం వచ్చేలా ప్లాన్ చేశారట. అయితే ఈ సాంగ్ను ఆల్బమ్తో విడుదల చేయకుండా థియేటర్లోనే ప్రదర్శిస్తారట. అంటే శ్రీకాకుళ జానపద గీతం చూడాలంటే సినిమా చూడాల్సిందే. ఇప్పటికే ఈ సినిమాలో `సామజవరగమన..`, `రాములో రాముల…` పాటలు విడుదలయ్యాయి. ఈ వారంలో మరో పాటను విడుదల చేస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 12న సినిమా విడుదలవుతుంది.