“గీతా గోవిందం” వరకు చిన్న సినిమాల హీరోలతో చేసిన పరుశురాం ఆ తర్వాత వరుస పెట్టి పెద్ద స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సర్కారు వారి పాట” చేసి పరవాలేదనిపించిన పరుశురాం తాజాగా బన్నీకి స్టోరీ లైన్ చెప్పినట్లు సమాచారం. మెడికల్ మాఫియా నేపథ్యంలో సరికొత్త సబ్జెక్టుతో ఈ సినిమా కథ ఉండనున్నట్లు.. ఈ చిన్న లైన్ ఉండటంతో స్టోరీని మరింతగా డెవలప్ చేసి మొత్తం ఒకేసారి వినిపించాలని పరుశురామ్ కి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తుంది.
ప్రస్తుతం బన్నీ “పుష్ప 2” సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం బన్నీ అమెరికాలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. సుకుమార్ పుష్ప 2 తర్వాత కొరటాల లేదా బోయపాటితో బన్నీ సినిమా చేయనున్నట్లు మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మాత్రం పరుశురాం చెప్పిన లైన్ బాగా నచ్చడంతో స్టోరీ ఓకే అయితే “పుష్ప” సెకండ్ పార్ట్ తర్వాత పరుశురాం సినిమా చేయాలని బన్నీ రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు “పుష్ప” తో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ అవ్వడంతో పరుశురాం..కూడా పాన్ ఇండియా నేపథ్యంలో స్టోరీ రెడీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ని “సర్కారు వారి పాట” లో పరుశురాం అద్భుతంగా చూపించడం జరిగింది. మరి బన్నీతో సినిమా ఓకే అయితే అంతకంటే మరింత పవర్ ఫుల్ పాత్రలో చూపించే దిశగా ప్రస్తుతం స్టోరీ రెడీ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.