Chiranjeevi: దివంగత దాసరి నారాయణ చనిపోయిన తరువాత.. ఇండస్ట్రీ పెద్ద గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. దాసరి నారాయణరావు ఉన్న సమయంలో చిత్ర పరిశ్రమకు సంబంధించి అనేక విషయాల్లో కలుగజేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూ.. తనదైన శైలిలో సమస్యలను పరిష్కరించే వాళ్ళు. కాగా ఆయన చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ పెద్ద అనే విషయం గురించి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ లాక్ డౌన్ సమయంలో ఇంకా చాలా సందర్భాలలో సినిమా కార్మికులకు నిత్యావసర సరుకులు మరియు ఆర్థిక సాయం అందించడంలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషించారు.
ఇక ఇదే సందర్భంలో ఇటీవల ఇండస్ట్రీకి సంబంధించి టికెట్ ధర విషయంలో కూడా చిరంజీవి చూపిన చొరవ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ తో ఓన్ టూ ఒన్ సమావేశమయ్యి ఇండస్ట్రీ సమస్యలను అదేవిధంగా టికెట్ ధర గురించి చర్చించి చివరాఖరికి ప్రభుత్వం నుండి సానుకూలంగా మంచి ధరలకు జీవో వచ్చేలా చేశారు. ఇదే సమయంలో తనని ఇండస్ట్రీ పెద్ద అని ఎవరు సంపాదించవచ్చని పలు సందర్భాలలో చిరంజీవి తెలపడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం లో నిర్మాతల మండలి అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టికెట్ ధరల విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం వైఎస్ జగన్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే సమయంలో సీఎం కి వైజాగ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలనే కోరిక ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమ వైజాగ్ కి కూడా ప్రాతినిధ్యం వహించేలా ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేశారు. అంత మాత్రమే కాక త్వరలో సీఎం జగన్ ని కలిసిన ధన్యవాదాలు తెలుపుతామని పేర్కొన్నారు. ఏదిఏమైనా చిరంజీవి యే… ఇండస్ట్రీకి పెద్ద అంటూ స్పష్టం చేశారు. ఆయన పెద్ద కాదన్న ఆయనే మాకు పెద్ద దిక్కు అని అన్నారు. ఇదే సమయంలో త్వరలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను సన్మానం చేస్తామని.. సి.కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!