బాలీవుడ్ నటుడు సుశాంత్ కేసు విషయంలో కేంద్రం సీబీఐకి అప్పజెప్పడం తో రావడం రావడంతోనే రియా చక్రవర్తి కి చుక్కలు చూపించింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ తన కొడుకు ఒకే కారణం రియా చక్రవర్తి అంటూ బీహార్ రాష్ట్రం పాట్నాలో పోలీస్ కేసు పెట్టడంతో దాని ఆధారంగా… జరుగుతున్న ఈ విచారణలో.. రియా చక్రవర్తి పై మరో ఆరుగురు పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు A1 గా రియా చక్రవర్తి పేరును పొందుపరచడం తో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ ఆరుగురు నిందితులపై సుశాంత్ సింగ్ ని ఆత్మహత్యకు ప్రేరేపించడం, కుట్ర,చోరీ, చీటింగ్ తదితర అభియోగాలను మోపుతూ కేసు ఫైల్ చేసింది సిబిఐ. ఈ ఆరుగురు రియా చక్రవర్తి కుటుంబ సభ్యులు కావడంతో …. కేసులో ఎటువంటి వాస్తవాలు బయటపడతాయి అనేదాని గురించి దేశవ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా గమనిస్తున్నారు.
ఇదిలా ఉండగా కేంద్ర దర్యాప్తు సంస్థ బీహార్ పోలీసులతో కూడా టచ్ లో ఉన్నట్లు తెలిపింది కేంద్ర దర్యాప్తు సంస్థ. సుశాంత్ తండ్రి పెట్టిన కేసు ఆధారంగా జరుగుతున్నా సిబిఐ దర్యాప్తు తో పాటు ఈడి కూడా రియా మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇప్పటికే ఈడి విచారణకు హాజరుకావాలని సమన్లు కూడా పంపడం జరిగింది. దీంతో ఒకవైపు సిబిఐ వేట మరో వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి ఇక చుక్కలే అనే టాక్ సోషల్ మీడియాలో బలంగా వినబడుతుంది.