RRR: దేశ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్” అనేక రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 25 వ తారీకు విడుదలైన ఈ సినిమా ప్రతి చోటా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. భాషలకు అతీతంగా.. దేశాల కతీతంగా “ఆర్ఆర్ఆర్” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తా ఏంటో నిరూపిస్తోంది. ఈ సినిమాతో మరోసారి జక్కన్న తన డైరెక్షన్ పవర్ ఏంటో నిరూపించాడు. రిలీజ్ అయిన ఫస్ట్.. సెకండ్ వీకెండ్ లలో ప్రతి ఇండస్ట్రీలో కాసుల వర్షం కురిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా “ఆర్ఆర్ఆర్” కి వస్తున్న కలెక్షన్ల పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన తాజా ప్రసంగంలో వైరల్ కామెంట్ చేశారు.
ఆయన ఏమన్నారంటే..” ప్రస్తుతం దేశవ్యాప్తంగా “ఆర్ఆర్ఆర్” సినిమా పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన అన్ని సినిమాల కంటే…”ఆర్ఆర్ఆర్” బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కలెక్షన్లు దాదాపు 750 కోట్ల రూపాయలు దాకా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమా మాదిరిగానే భారతీయ ఆర్థిక వ్యవస్థ కూడా దూసుకుపోతుంది. రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేస్తూ ఉంది.
ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో అనేక భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవడం మాత్రమే కాక వాటిని అందుకునే సత్తా సామర్థ్యం భారత దేశం సొంతం చేసుకుంటుంది అంటూ…”ఆర్ఆర్ఆర్” తో భారతీయ ఆర్థిక వ్యవస్థ ను పోల్చారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. “ఆర్ఆర్ఆర్” అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సామాన్య ప్రేక్షకులు మొదలుకొని సెలబ్రిటీల వరకు సినిమాకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దీంతో తెలుగులో ఇప్పటికే 200 కోట్లు మార్క్ అందుకోక హిందీలో కూడా.. కేవలం.. పదిహేను కోట తక్కువ 200 కోట్లు కొల్లగొట్టే రీతిలో కలెక్షన్ వస్తున్నట్లు సమాచారం. గ్యారెంటీగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో “ఆర్ఆర్ఆర్” బాహుబలి మాదిరి ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!