ఈ ఏడాది `మజిలీ`తో హిట్ను సొంతం చేసుకున్న అక్కినేని నాగచైతన్య ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను 40 రోజుల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ జరిగింది. దీని తర్వాత ఓ బాలీవుడ్ రీమేక్లో చైతన్య నటించే అవకాశాలున్నాయని సమాచారం. ఆ చిత్రమే `బదాయి హో`. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్రాజు, బోనీకపూర్ కలిసి నిర్మించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. స్క్రిప్ట్ పూర్తి కాకమునుపే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేసేస్తారట. దర్శకుడు ఇతర వివరాలను నిర్మాతలు త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తారట. జాతీయ అవార్డుల్లో ఎంటర్టైనింగ్ మూవీగా అవార్డు దక్కించుకున్న `బదాయి హో` మరి తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పించనుందో చూద్దాం.
previous post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!