జనసేనాని పవన్ కల్యాణ్ డీ హై డ్రేషన్ కారణంగా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన్ని అల్లు అర్జున్ పాలకొల్లులో కలిసి పరామర్శించి మద్దతు పలుకుతారు. అక్కడి నుండి నర్సాపురం చేరుకుని.. నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి కె.నాగబాబుకి మద్దతుని తెలుపుతారు.అలాగే పాలకొల్లులో కూడా బన్ని ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నాగబాబుకి మద్దతుగా ఆయన కుమార్తు నిహారిక, కొడుకు వరుణ్ తేజ్ ప్రచారం చేశారు. క్రమంగా జనసేనకు మెల్లగా మెగా హీరోల నుండి మద్దతు దొరుకుతుంది.
నిన్న పవన్ కల్యాణ్ ని రాంచరణ్ కలిసి పరామర్శించారు. `RRR` షూటింగ్ కు సిద్ధమవుతుండగా చరణ్ మడమకు గాయమైన సంగతి తెలిసిందే. బాధ ఇబ్బంది పెడుతునా సరే.. చరణ్ కూడా రెండు రోజుల పాటు ప్రచారం చేయబోతున్నారని సమాచారం. చరణ్ గాజువాక, పెందుర్తి నియోజక వర్గాల్లో ప్రచారం చేయబోతున్నారట.