Aacharya: మహమ్మారి కరోనా కారణంగా దాదాపు రెండు సంవత్సరాలు… వేసవి సీజన్ మిస్ కావడం జరిగింది. అయితే ఈసారి వేసవికి పరిస్థితులు అంతా నార్మల్ గా ఉండటంతో భారీ బడ్జెట్ పెద్ద సినిమాలు మొత్తం ఒక్కొక్కటి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. “భీమ్లా నాయక్”, రాధేశ్యం, “ఆర్ఆర్ఆర్” రిలీజ్ కాగా.. వీటిలో “ఆర్ఆర్ఆర్” రికార్డుల మోత మోగిస్తోంది. దాదాపు “బాహుబలి” రికార్డు పగలగొట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తర్వాత రిలీజ్ కాబోయే “ఆచార్య” పై అందరి దృష్టి ఏర్పడింది. ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ లేని డైరెక్టర్ లిస్టులో ఉన్న కొరటాల శివ ఈ సినిమా తెరకెక్కించడం తో పాటు చరణ్, చిరంజీవి కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పైగా 13 సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించడంతో మెగా అభిమానులు… “ఆచార్య” గ్యారెంటీగా హిట్ అవుతుందని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు. సినిమా ప్రధాన పాత్రలో చిరంజీవి అయినా గాని దాదాపు 40 నిమిషాల పాటు చరణ్ పాత్ర ఉంటుందని ఇప్పటికే వార్తలు రావటం మనం చూశాం. అయితే సినిమా మొత్తానికి హైలెట్ సన్నివేశం గురించి లేటెస్ట్ వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే చరణ్ చిరంజీవి కలిసి… అడవిలో ఒక ఫైట్ చేయటం జరుగుతుందట.
అది సినిమా మొత్తానికే హైలైట్ గా… కొరటాల చిత్రీకరించినట్లు లేటెస్ట్ టాక్ బయటకు వచ్చింది. 40 నిమిషాల లో చరణ్.. చిరంజీవి కలిసిన సన్నివేశాలు దాదాపు 20 నుండి 25 నిమిషాల వరకు ఉంటాయని… ఇద్దరు చేసే ఫైట్ సీన్స్.. చూసే ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఏప్రిల్ 29వ తారీకు ఆచార్య విడుదల కానుంది. ఏప్రిల్ రెండో వారం నుండి సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ వుంది. “ఆర్ఆర్ఆర్” సూపర్ డూపర్ హిట్ కావడంతో “ఆచార్య” ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!